Monday 7 May 2012

ప్రభుత్వం మాఫియా......ఒక విశ్లేషణ ...


మాఫియా చేసే అసలు నేరాలు  
  1. బలవంతపు వసూలు (హఫ్త):   మాఫియా చేసే ముక్య కార్యకలాపాలలో ఇది ఒకటి, అంటే జనాలని బెదిరించి డబ్బులు గుంజటం. ఇది నేరం అయితే ప్రభుత్వానికి మించి ఎవరు బలవంతపు వసూళ్ళకు పాలుపడరు కాకపోతే దానిని వారూ tax అంటారు.సరిగ్గా గమనిస్తే మాఫియా చేసే దానికి ప్రభుత్వం చేసే పనికి పెద్ద తేడా లేదు ఎవరు చేసిన ఒకరి దగ్గర బలవంతం గ గుంజతం ఇంకో చోట కర్చు పెట్టటం.
  2. కబ్జాలు (భూమి మరియు ఇతర ఆస్తులు): భూమిని కబ్జా చేయటం మాఫియా కార్యకలాపాలలో ఇంకొక టి, అసలు ప్రభుత్వానికి మించిన కబ్జకోరు ఎవరు వుండరు రాత్రికి రాత్రి భు పరిమితి చట్టం అనో ప్రాజెక్ట్ అనో రోడ్ అనో లేక మెట్రో రైలు అనో లేక సెజ్ అనో మన భూమిని మన ఇష్టంతో సంభందం లేకుండా ప్రభుత్వం ఆక్రమించుకో వచ్చు. మరి మాఫియా చేస్తే నేరం ప్రభుత్వం చేస్తే ప్రజా  ప్రయోజనార్ధం. 
  3. నకిలీ నొట్ల చెలామణి:దొంగ నోట్ల చెలామణి మాఫియా చేసే నేరాలలో ఒకటి అంటే దొంగ నోట్లు ముద్రించి  చెలామణి చెయ్యటం దీని వలన మార్కెట్లో డబ్బు సరఫరా పెరిగి ద్రవ్యోల్బణంకు దారితిస్తుంది. మరి ప్రభుత్వం దాని చేతులోని సెంట్రల్ బ్యాంకు ద్వారా  డబ్బు సరఫరా ను దాని అవసరం మీరా పెంచుతా పోతే అది కూడా ద్రవ్యోల్బణానికి దారి తీస్తుంది మరి అది తప్పు కాదా 
ఇప్పుడు మాఫియా చేసే నేరాలు కాని నేరాలని చూదాం (అంటే బాధితులు లేని నేరాలు - victimless crimes) 

  1. స్మగ్లింగ్: ప్రభుత్వం నిషేధించిన లేక ఎక్కువ ఇంపోర్ట్ డ్యూటీ కలిగిన వస్తువులని  దొంగచాటుగా మన దేశం లోకి తేవటమే స్మగ్లింగ్. దీనిలో బాధితులు లేరు చెప్పాలంటే ప్రభుత్వం నిషేధించటం వల్లే బాధితులు వుంటారు తప్ప స్మగ్లింగ్ వల్ల బాధితులు వుండరు. బాధితులు లేని నీరాన్ని అరికట్టదనింకి ప్రభుత్వం కోట్లు కర్చు చేస్తున్నది.అసలు మాఫియా చరిత్త్ర లోకి వెళ్ళితే అసలు అమెరికాలో మాఫియా పుట్టిందే 1920 లో మద్య నిషేధం వాళ్ళ దానిని స్మగ్లింగ్ చెయ్యటానికి పుట్టిందే మాఫియా.
  2. మాదకద్రవ్యాల సరఫరా: కొన్ని రకాల మత్తు పదార్దాలు మంచివి కావు అని ప్రభుత్వం నిర్ణయించి వాటిని నిషేధించటం వలన ఐనను ప్రజల నుంచి డిమాండ్ వుండటం వలన వారి అవసరం మాఫియా తీరుస్తునది.  ఈ మాదకద్రవ్యాలు వాడే వారు నేర ప్రవుర్తి కలవారిగా మారతారని చెబుతారు అసలు విషయానికి వస్తే ప్రభుత్వం నిషేధించటం వలన దాని ధర 100 రేట్లు పెరిగి వాటిని సంపాదించటం కోసం నేరాలు చేస్తున్నారు కాని మాదకద్రవ్యాల వలన నేరాలు జరగట్లేదు. నిషేధం లేకపోతే heroin అలవాటుకు అమెరికాలో సంవత్సరానికి రూ. 15000 వరకు కర్చు అవుతుంది కానీ  నిషేధం వలన ఇప్పుడు 16 నుంచి 20 లక్షలు అవుతునై ఇంత డబ్బు కావాలంటే దొంగ తనలకి వివిధ నేరాలకి పాల్పడాల్సి వస్తుంది. అమెరికా జైల్లో 50% మందికి పైగా మాదకద్రవ్యాలకు సంభందించిన నేరస్తులే అంటే ప్రభుత్వం ఎంత డబ్బు ని వృధా చేస్తోదో అర్థం చేసుకో వచ్చు. 
  3. వ్యభిచార గృహాలు : దీనివల్ల బాధితులు వుండరు .....స్వచంద వ్యాపారం మాత్రమే.....ప్రభుత్వం నిషేధం వలన మాఫియా చేతిలోకి వెళ్ళింది.
  4. బెట్టింగ్ మరియు జూదం: కొన్ని రకాలైన జుఉడాలని ప్రభుత్వం అనుమతించి (గుర్రపు పందాలు) కొన్నిటిని తనే నిర్వహిస్తూ (lottery tickets) కొన్నిటిని మాత్రం నిషేదించటం ప్రభుత్వానికే చెల్లింది. ఇందులోనూ స్వచండ వ్యాపారమే తప్ప బాధితులు లేరు ప్రభుత్వ నిషేధం వలమఫియా చేతిలోకి వెళ్ళింది. 
మాఫియాని అంతమొందించాలంటే ప్రభుత్వం తన పరిధిని తగ్గించుకోవాలి లేనిచో ఎంత అనగాదోక్కిన నిషేదాలు ఉవునంత కాలం మాఫియా వుంటుంది.
పైన పేర్కొన్న మొదటి నేరాలు అరికట్టవలిసినవే కాని ప్రభువ్త్వమే ఆ నేరాలు పాల్పడుతుంది. తప్పు ఎవరు చేసినా తప్పే ప్రభుత్వమైనా ప్రైవేటు  వ్యక్తులు ఐనా...ఆపవలసిందే
కింద పేర్కొన్న నేరాలు ప్రభుత్వ నిషేధం లేకపోతే మాఫియా అవసరమే వుండదు.....

గమనిక: ఇది పలనా దేశానికో లేక ప్రాంతానికో లేక పార్టీ కో మాత్రమె పరిమితం కాదు. అలానే నీతికి అవినీతికి కూడా సంభందం లేదు. మాఫియా చేస్తున్నది  నేరం అయితే మరి ప్రభుత్వం అదే పనిచేస్తే లేక కారణం అయితే మరి దానిని ఏమంటారో అని తెలుసుకొనే ప్రయత్నం.
  

Saturday 14 April 2012

గొడ్డు మాంసం.... కొన్ని ప్రశ్నలు, జవాబులు...

నువ్వు గొడ్డు మాంసం తింటావా?
ఇష్టంగా తింటా...ముఖ్యంగా బీఫ్ కబాబ్లు బాగా ఇష్టం

గొడ్డు మాంసం ban చెయ్యడాన్ని ఆమోదిస్తార?
లేదు నా ఇష్టం అలవాట్ల మీద వేరే వాళ్ళ పెత్తనాని సహించను

గొడ్డు మాంసం వళ్ళ దేశ లేక గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు దేబ్బతిన్టై అని నమ్ముతావ?
లేదు కచ్చితంగా కాదు అసలు ban వల్లే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది

హిందూ మతస్తుల మనోభావాలు దేబ్బతిన్టై అని భావిస్తావా?
అసలు మనోభావాలు దేబ్బతిన్టై అనుకొంటే మనిషి బ్రతక లేడు. గుడ్డు తింటే ఒకరికి దెబ్బతినవచ్చు, గొడ్డు తింటే ఒకరికి  దెబ్బతినవచ్చు అసలు ఉల్లి తింటే ఇంకొకరికి దెబ్బతినవచ్చు....

ఉస్మానియా హాస్టలో గొడ్డు మాంసంని అనుమతించక పోవటం దళితులని వారి అలవాట్లని కించపరచటం కింద వస్తుందా?
ఒకవిధంగా అంతే అనుకోవాలి. శాంతి భద్రతలు సమస్యలు చూపించి అనుమతిన్చంక పోవటం సరికాదు. అప్పుడు సమస్య గొడవ చేసే వాళ్ళది వాళ్ళని కట్టడి చెయ్యటం పోయి ఏదో beef festival చేసుకొనే వళ్ళ మీద పడటం తప్పు.

అలాగే పంది మాంసం కూడా హాస్టల్ లో అనుమతించాల?
అవును పంది మాంసం కూడా అనుమతించాలి



  

Friday 13 April 2012

ప్రైవేటు బడులలో ఉచిత విద్య... ఎవడి సొమ్ము తో?

ప్రైవేటు బడులలో కూడా 25%  సీట్లని పేదవాళ్ళకి కేటాయించాలి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బాలలు చదువుకోవటం వారి ప్రాధమిక హక్కు అని ఉచిత విద్యనూ ఇవ్వలేననటం వారి నుండి ప్రాధమిక హక్కు లని దూరం చేయటమే అని కోర్టు తన తీర్పు పేర్కోనది. 

అయితే కోర్టు చదువు అన్నది ఊరికే దొరికే వస్తువు కాదని చదువు చెప్పటానికి కర్చు అవుతుందని ఆ కర్చు ఎవరు
 బరిస్తారో చెప్పకపోవటం విచారకరం. ఇప్పుడు ఈ ఉచిత భారాన్ని ఎవరు బరిస్తారు, ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా, ప్రభుత్వం  దాని లెక్కల ప్రకారమే ఇస్తుంది అంటే ఒక విద్యార్ధికి ఒక ప్రైవేటు బడిలో సంవత్సరానికి ఆరు వేలు కర్చు అవ్తోంది అనుకొంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక విద్యార్ధికి మహా అయితే ఏడాదికి మూడు వేలు వరుకు ఇస్తారు అంటే మిగిలిన మూడు వేలు ఆ స్కూలు ఫీజులు పెంచి వసూలు చెయ్యవలసిందే. పోనీ ప్రభుత్వం ఇచ్చే డబ్బు అయినా ఎక్కడ నుంచి వస్తోంది అది ప్రజల దగ్గర పన్నులు రూపంలో వసూలు చేసిందే అంటే ఎటు తిరిగి భారం ప్రజల పైనే.

ప్రస్తుతం ఎవరైతే వారి పిల్లలను ఫీజులు కట్టి ప్రైవేటు స్కూల్లో చదివిస్తునారో వారు కూడా ఇప్పుడు కట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రైవేటు బడులూ నకిలీ హాజరు పట్టికలు చూపించి ప్రభుత్వం ఇచే సొమ్ము ని దోచుకొంటై దానికోసం అధికారులకి ముడుపులు ముట్ట చెబుతాయి చివరికి ఇది మరో కుంబకోణం అవుతుంది ప్రజల నెత్తి మీద సంవత్సరానికి మరో ఏబై వేల కోట్ల భారం.

పిల్లలను బడి కి పంపాలి అంటే నిర్బంధ విద్య చట్టం తో పరిష్కారం రాదు...ప్రజలకు చదువుకుంటే వుండే లాబాలు తెలియాలి ప్రభుత్వమే ఉపాధి హామీ అని పని వున్నా లేక పొఇనా కూలి ఇచ్చి రెండు రుపైల కే కిలో బియం ఇస్తే చదువుకొని సంపదిన్చావలిసిన అవసరం ప్రజలకు ఏమిటి. చదువు హక్కు అని తిండి హక్కు అని ఇల్లు హక్కు అని బట్ట హక్కు అని అన్ని ఉచితంగా ఇవ్వటానికి ప్రభుత్వానికి డబ్బులు ఏమి చెట్టుకు కాయటంలా ప్రజల వద్ద నుంచే పన్నులు అనే పేరుతో దోపిడీ చేస్తోంటే వస్తునై ఈ దోపిడిని ప్రజలందరూ ముక్త కాంతం తో వ్యతిరేకించాలి.

ప్రజలకి ఎజమన్యాలకి వున్నదార్లు ఏమిటి. ప్రతి స్కూలు stateboard మరియు central board ల నుంచి తమ  గుర్తింపును
స్వచందంగా విరమించుకోవాలి ప్రైవేటుగా తమ సిలబస్ తామే తాయారు చేసుకోవాలి (ఇది ఇంకా మంచి సిలబస్ తాయారు చేయటానికి ఎంతో ఉపయోగం) ఈ స్కూలలని సిలబస్ని ratings ఇవ్వటానికి (credit ratings ఇచ్చే ICRA, CRISIL, Moodys & S&P లాగా) ప్రైవేటు సంస్థలని ఏర్పాటు చేసుకోవాలి వీటి ratings ఆధారంగా పై చదువులకు వెళ్లవచ్చు. ఇంత చేసిన ప్రభుత్వం తనకు వున్న అధికారం తో చట్టాన్ని అమలు చెయ్య వచ్చు కాని ఈ చట్టం తప్పు అని ప్రతి ఒక్కరు గ్రహించాలి అంతవరకు ఈ ప్రభుత్వం అనే గూండా చేతిలో మనం హింసించ బడుతునే వుంటాం.